వైఎస్సార్ సీపీ గెలుపు చారిత్రక అవసరం.. ఆశీర్వదించండి. మీకు మంచి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ..
వైఎస్సార్ సీపీ గెలుపు చారిత్రక అవసరం.. ఆశీర్వదించండి. మీకు మంచి చేస్తాం.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు వీరాంజనేయులు, శంకర్ నారాయణ
సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరమని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు, అనంతపురం ఎంపీ అభ్యర్థి ఎం. శంకర్ నారాయణ అన్నారు.
శింగనమల మండలం ఉల్లికల్లు, ఉల్లికంటిపల్లి గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా గడపగడపకు ఎన్నికల ప్రచారాన్ని పార్టీ శ్రేణులు, జిల్లా వైస్సార్సీపీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, లింగాల రమేష్ లతో కలసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు చేపట్టారు.
ముందుగా పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుతో పాటు అభివృద్ధి కొనసాగలంటే ప్రతి ఒక్కరూ "ఫ్యాన్" గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని బలపరచాలని అభ్యర్థించారు.
వారు మాట్లాడుతూ..జగనన్న ఐదేళ్ల పాలనలోనే అద్భుతాలు చేశారని చెప్పారు. ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రధానమంత్రి ప్రశంసలే ఇందుకు నిదర్శనం అన్నారు. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలన్న, మరింత అభివృద్ధి జరగాలన్న జగనన్నకు మరోసారి సీఎంగా అవకాశం ఇవ్వాలన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రతి రాజకీయ పార్టీ విడుదల చేసే మేనిఫెస్టోలోని హామీలను నెరవేర్చిన దాఖలు లేవని, అయితే జగనన్న 99% హామీలను నెరవేర్చి సరికొత్త చరిత్ర సృష్టించారన్నారు. చంద్రబాబు నాయుడు ఎన్ని కుట్రలు చేసిన రానున్న ఎన్నికలలో జగనన్నను ప్రజలు ఆశీర్వదిస్తారన్నారు. టిడిపి చెబుతున్న హామీలను ప్రజలు నమ్మకపోవడంతో ఓటమి భయంతో దాడికి పాల్పడుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Apr 18 2024, 07:06